హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : టీఎస్ఆర్టీసీకి రెండు జాతీయస్థాయి అవార్డులు వరించాయి. రహదారి భద్రత క్యాటగిరీలో ఇద్దరు డ్రైవర్లకు ప్రతిష్ఠాత్మక ‘హీరోస్ ఆన్ ది రోడ్’ పురసారాలు లభించాయి. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) శనివారం ప్రకటించింది. కుషాయిగూడ డిపోకు చెందిన కే రంగారెడ్డి, సూర్యాపేట డిపోకు చెందిన కే సోమిరెడ్డి అవార్డులకు ఎంపికయ్యారు. సర్వీస్లో ప్రమాద రహితంగా విధులు నిర్వహించినందుకు ఈ పురస్కారాలు అందిస్తున్నది. పట్టణ, గ్రామీణ విభాగాల్లో ఈ అవార్డులను ఏఎస్ఆర్టీయూ ప్రకటించింది. ఈ అవార్డులను కేంద్ర రోడ్డు, ట్రాన్స్పోర్ట్మంత్రి నితిన్ గడరీ ఏప్రిల్ 18న అందజేస్తారు. అవార్డు గ్రహీతలకు సర్టిఫికెట్, నగదుతోపాటు ట్రోఫీ ఇచ్చి సతరిస్తారు. ఇద్దరు డ్రైవర్లకు పురస్కారాలు రావడంపై సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు.