సంక్రాంతి పండుగ సందర్బంగా హైదరాబాద్లో నివసించే వారిలో చాలామంది తమ సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. అయితే ఈ రోజుతో సంక్రాంతి పండుగా పూర్తికావడంతో.. సొంత గ్రామాలకు వెళ్లిన ప్రయాణికులు తిరిగి హైదరాబాద్ వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
దీంతో ఈ రోజు నుంచి మళ్లీ హైదరాబాద్ తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం ఆర్టీసీ, రైల్వే వాళ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే శాఖ 110 రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.
సొంత గ్రామాలకు వెళ్లిన వారి కోసం 3,500 స్పెషల్ బస్సులను నడపాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.