హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలగిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తుల కోసం బస్సు సర్వీసు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. గురుపౌర్ణమి సందర్భంగా జూలై 3న అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సర్వీసు నడుపనున్నది. జూలై 2న ఉదయం 6 గంటలకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి బస్సు బయలుదేరుతుంది.
ఆంధ్రప్రదేశ్ కాణిపాకంలోని విఘ్నేశ్వరుని దర్శనానంతరం అదేరోజు రాత్రి 10 గంటలకు అరుణాచలం చేరుకుంటుంది. గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత జూలై 3న సాయంత్రం 3 గంటలకు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్కు వెళ్తుంది. అకడ దర్శనానంతరం హైదరాబాద్కు జూలై 4న ఉదయం10 గంటలకు చేరుకుంటుంది. ఈ టూర్ ప్యాకేజీకి ఒకొకరికి రూ.2600 టికెట్ ధర నిర్ణయించినట్టు సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. టికెట్లను www.tsrtconline.inలో ముందస్తుగా, ఎంబీజీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్ బస్టాండ్లతో పాటు సమీప ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లలోనూ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. వివరాల కోసం 9959226257, 9959224911 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.