కౌడిపల్లి, ఆగస్టు 13: గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం మెదక్ జిల్లా కౌడిపల్లి రైతు వేదికలో అధికారులు నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్లు సమస్యలను మండల సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండల అధికారులు సమస్యలు పరిష్కరించాలని, లేదంటే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు. సమావేశానికి గైర్హాజరైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రానివారికి మెమో జారీచేసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. యూరి యా సకాలంలో అందించాలని, యాప్ తో రైతులకు నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వం రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదన్నారు. వ్యవసా యం, విద్యుత్ అంశాలపై ప్రధానంగా చర్చించారు. సమావేశంలో డీఎల్పీవో సురేశ్బాబు, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ కృష్ణ,ఆయా గ్రామాల సర్పంచ్లు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.