TSRTC | సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లే వారికి టీఎస్ ఆర్టీసీ శుభవార్త వినిపించింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలనుకునే వారికి అడ్వాన్స్డ్ టికెట్ల రిజర్వేషన్ సదుపాయం కల్పించింది.
అయితే తమ సొంతూర్లకు వెళ్లడం కోసం టికెట్ బుకింగ్ చేసుకున్నప్పుడే.. తిరుగు ప్రయాణం కూడా బుక్ చేసుకుంటే, ఆ టికెట్పై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఈ ఆఫర్ జనవరి 31వ తేదీ వరకు వర్తించనుందని తెలిపింది. ఈ రాయితీ డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్ బస్సుల్లో కల్పించారు.
ప్రయాణికుల రవాణా ఖర్చులను దృష్టిలో ఉంచుకొని, తిరుగు ప్రయాణంపై 10 శాతం డిస్కౌంట్ కల్పించినట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. తదితర వివరాల కోసం www.tsrtconline.in వెబ్సైట్ను సంప్రదించొచ్చు.