న్యూఢిల్లీ, ఆగస్టు 13: భారతదేశం మీదుగా విస్తరించిన దట్టమైన మేఘా లు, బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణితో మరికొద్ది రోజుల్లో దేశమంతటా భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వర్గాలు అంచనా వేస్తున్నా యి. ఆగస్టు 13న ఈయూ మెటాశాట్, ఇస్రోకు చెందిన ఇన్సాట్-త్రీడీ ఉపగ్రహాలు తీసిన చిత్రాలు..అరేబియా సముద్రం నుంచి మధ్య భారతం మీదుగా విస్తరించిన భారీ మేఘాల పొరను స్పష్టంగా చూపిస్తున్నాయి.
దట్టమైన మేఘ సమూహాలు ఉత్తర బంగాళాఖాతం, తూర్పు భారతదేశం, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతా ల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. ఇక్కడ కొత్తగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి తీరం వైపు కదులుతున్నది. దీంతో రాబోయే కొద్ది రోజుల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ సరిహద్దు రాష్ర్టాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది. ప్రస్తుతానికి అంతరిక్షం నుంచి చూస్తే రుతుపవనాల గమనం అత్యంత చురుకుగా ఉన్నట్టు కనిపిస్తున్నది. ఫలితంగా ఆగస్టు నెలాఖరులో వర్షపాతం గణనీయంగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.