న్యూఢిల్లీ, ఆగస్టు 13: మంజూరైన అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగాలలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ)లో సగం, సీబీఎస్ఈలో 44 శాతం ఖాళీగా ఉన్నాయని పార్లమెంటరీ కమిటీ నివేదిక వెల్లడించింది. కమిటీ బుధవారం లోక్సభకు సమర్పించిన 10వ నివేదికలో విద్యకు సంబంధించిన పలు అంశాలను వివరించింది.
ఎన్సీఈఆర్టీలో 2,844 ఉద్యోగాలకు 1,596, సీబీఎస్ఈలో 2,117 పోస్ట్లకు 933 ఖాళీగా ఉన్నాయి. సీబీఎస్ఈలో ఎక్కువగా తాత్కాలిక, కాంట్రాక్టు సిబ్బందిపై ఆధారపడుతున్నారని, దీని వల్ల అలాగే దేశంలో వివిధ స్థాయిల్లో పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నదని వెల్లడించింది. సెకండరీ విద్యను పూర్తి చేయకుండానే 73 శాతం డ్రాపౌట్లు నమోదయ్యాయని కమిటీ వివరించింది.