TSRTC | దసరాకు సొంతూళ్లుకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి 29వ తేదీల మధ్యలో ప్రయాణానికి గానూ రానూపోనూ ఒకేసారి టికెట్లు బుక్ చేసుకుంటే.. తిరుగు ప్రయాణంపై 10 శాతం డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది. ఈ నెల 30వ తేదీలోపు టికెట్ రిజర్వేషన్ చేసుకున్న వారికే ఈ రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ రాయితీ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. ముందస్తు రిజర్వేషన్ల కోసం సంస్థ అధికారిక వెబ్సైట్ https://www.tsrtconline.in/ లో సంప్రదించాలని కోరారు.
దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయతీ ఇవ్వాలని #TSRTC నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణం పై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు…
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) September 21, 2023