నాంపల్లి కోర్టులు, జూన్ 12 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు రాజశేఖర్రెడ్డి బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. ప్రధాన నిందితుడు పులిదిండి ప్రవీణ్కుమార్ తరఫున సోమవారం బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. బొడ్డుపల్లి నర్సింగ్రావు, రోహిత్కుమార్, ముదావత్ ప్రశాంత్ తరఫున న్యాయవాదులు వాదనలు కోర్టుకు వినిపించారు. చాట్ జీపీటీ సహాయంతో నిందితులు జవాబులు పూర్తి చేశారని, విచారణ కొనసాగుతున్నదని, బెయిల్ మంజూరు చేయవద్దని సిట్ పీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. తీర్పును కోర్టు మంగళవారానికి వాయి దా వేసింది. కోస్గి రవికుమార్, కోస్గి భగవంత్కుమార్, భూక్యా మహేశ్ తరఫున వేసిన పిటిషన్లకు కౌంటర్ దాఖలు చేయాలని పీపీని న్యాయస్థానం ఆదేశించింది. నూతన్కుమార్ పిటిషన్కు పీపీ కౌంటర్ దాఖలు చేశారు. న్యాయవాది వాదనల కోసం మంగళవారానికి వాయిదా వేసింది. కొంతం మురళీధర్రెడ్డి, ఆకుల మనోజ్కుమార్, పీ అరుణ్కుమార్, రమావత్ రమేశ్, ముదావత్ శివకుమార్, క్రాంతికుమార్రెడ్డి, కొంతం శశిధర్రెడ్డి, పురేందర్, జాదవ్రాజ్ తరఫున సోమవారం బెయిల్ పిగిషన్లు కోర్టుకు దాఖలు చేశారు.