హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు సీఆర్పీసీ 91 కింద సిట్ శనివారం రెండోసారి నోటీసు జారీచేసింది. ఆదివారం ఉదయం 11 గంటలకు కార్యాలయం లో సిట్ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు దర్యాప్తు నేపథ్యంలో మీరు చేసిన ఆరోపణలు, విమర్శలకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారా లు వెంట తీసుకురావాలని సూచించింది. ‘జగిత్యాలలో ఓ మండలంలో 50 మందికిపైగా క్వాలిఫై అయ్యారు. ఒక చిన్న గ్రామంలో ఆరుగురు అర్హత సాధించారు. వారంతా బీఆర్ఎస్ నేత కొడుకులు, బంధువులు, వాళ్ల వద్ద పని చేసే వాళ్లే. నలుగురు సర్పంచుల కొడుకులు, సింగిల్ విండో చైర్మన్ కొడుకుతోపాటు ఒక జడ్పీటీసీ వద్ద బాడీగార్డుగా పనిచేసే వ్యక్తి కొడు కు, ఓ కేంద్ర పభుత్వ ఉద్యోగి కుమారుడు క్వా లిఫై అయ్యాడు. ఒక సర్పంచ్ కొడుకుకి అర్హత అయ్యే అవకాశమే లేకున్నా క్వాలిఫై చేశారు’ అని బండి సంజయ్ మాట్లాడినట్టు గుర్తించామ ని నోటీసులో అధికారులు వివరించారు. గతం లో సిట్ నోటీసులకు బండి సంజయ్ పార్లమెం ట్ సమావేశాల నేపథ్యంలో హాజరు కాలేనని పోలీసులకు తెలిపిన విషయం తెలిసిందే. ఆదివారం బండి సిట్ ముందు హాజరవుతారా? డుమ్మా కొడతారా అనేది ఆసక్తిగా మారింది.