TSPSC | హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని ఎన్ఎస్యూఐ నాయకుడు బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రస్తుతం సిట్ దర్యాప్తు కొసాగుతోందని, ఇలాంటి సమయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.
సిట్ దర్యాప్తులో పురోగతి ఉందని అభిప్రాయపడిన కోర్టు.. విచారణను ఎప్పటి వరకు పూర్తి చేస్తారో చెప్పాలని హైకోర్టు సిట్ను అడిగింది. సీఎఫ్ఎల్(సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబోరేటరీ) నివేదిక రాగానే విచారణ పూర్తి చేస్తామని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ కోర్టుకు విన్నవించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు పురోగతిలో ఉందని అడ్వకేట్ జనరల్ ప్రసాద్, సిట్ ఏసీపీ నర్సింగ్ రావు వివరణ ఇవ్వడంతో హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది.