హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా (Sumitra Anand) తన పదవికి రాజీనామా (resigns) చేశారు. శుక్రవారం తన రాజీనామా లేఖను గవర్నర్ (Governor) కు పంపించారు. వ్యక్తుల కారణంగా వ్యవస్థపై మచ్చ పడిందని జరిగిన దుష్పరిణామాలకు సభ్యులుగా తమ ప్రమేయం ఏమీ లేదని పేర్కొన్నారు. కమిషన్ మార్పే ప్రక్షాళన అనే స్థాయిలో జరిగిన ప్రచారం తనను తీవ్రంగా బాధించింది ఆమె అన్నారు.
ఉద్యోగ నామ సంవత్సరం అనుకున్న సంవత్సరమే ఎన్నికల సంవత్సరం కావడం వల్ల తాము ఉద్యోగ నియామక ప్రక్రియను సజావుగా జరపలేకపోయామని వివరించారు. తెలంగాణలో అసంతృప్తిగా ఉన్న నిరుద్యోగులకు(Unemployees) నాటి ప్రభుత్వం సత్వరంగా ఉద్యోగ నియమకాలు చేపట్టడానికి అడుగులు వేసిందన్నారు. ఈ సమయంలో ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు, వివిధ పార్టీలు ఉద్యోగార్థుల పక్షం వహించి పరీక్షల వాయీదాలకోసం రకరకాలుగా ప్రభుత్వం పై ఒత్తిడిని పెంచిందన్నారు.
ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బీ జనార్ధన్రెడ్డి, సభ్యులు బండి లింగారెడ్డి, ఆర్ సత్యనారాయణ, కారం రవీందర్రెడ్డిలు రాజీనామాలు సమర్పించగా వీరి రాజీనామాలను ఇటీవలే గవర్నర్ ఆమోదించారు. ప్రస్తుతం కోట్ల అరుణకుమారి ఒక్కరే కమిషన్ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. నియామక ప్రక్రియ లో పని చేసే అవకాశం కల్పించిన ఉద్యమ సారథి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆమె ధన్యవాదాలు తెలిపారు.