హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యాశాఖలో పెండింగ్లో ఉన్న టీచర్ పోస్టుల ఫలితాలను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. కోర్టు కేసుల వల్ల చాలాకాలంగా నిలిచిపోయిన స్కూల్ అసిస్టెంట్, సోషల్ స్టడీస్ (తెలుగు మీడియం) ఉద్యోగాలకు ఐదుగురు అభ్యర్థులు ఎంపికైనట్టు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. కోర్టులో ఉన్న కేసులు క్లియర్ కావడంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు. ముగ్గురు ఎస్జీటీ తెలుగు మీడియం అభ్యర్థులను కూడా ఎంపిక చేసినట్టు వెల్లడించారు. ఫలితాలను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచినట్టు పేర్కొన్నారు. విద్యాశాఖలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి 2017లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.