హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. ఈ పరీక్షలను డిసెంబర్ 15 నుంచి 23 వరకు నిర్వహిస్తామని ప్రకటించింది. వాస్తవానికి ఈ నెల 17 నుంచి 25 వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నది.
అయితే, ఉద్యోగులంతా ఎన్నికల శిక్షణ సహా ఇతర విధుల్లో ఉన్నారు. దీంతో పరీక్షలను వాయిదా వేయాలని ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకొన్నది.