హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 దరఖాస్తులకు మరో రెండు రోజుల గడువు పొడిగిస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకొన్నది. ఈ నెల 14 నాటికే గడువు ముగిసినా, చివరి రోజు సర్వర్ మొరాయించటంతో చాలా మంది దరఖాస్తు చేసుకోలేక పోయారు.
ఫిర్యాదులు వెల్లువెత్తటంతో గడువు పొడిగించారు. ఈ నెల 16 వరకు గ్రూప్-1కు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించినట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. కాగా, గతంతో పోల్చితే ఈసారి గ్రూప్-1కు దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. డీఈడీ, బీఈడీ పూర్తిచేసినవారు డీఎస్సీ, గురుకుల పోస్టుల వైపు మొగ్గు చూపుతుండటమే కారణమని తెలుస్తున్నది.