TSPSC | అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఈ నెల 5న అసిస్టెంట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (TPBO) పరీక్ష సందర్భంగా ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగుచూడగా.. ఏఈ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఏఈ పోస్టులకు సంబంధించి పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని, త్వరలోనే కొత్త తేదీలను ప్రకటించనున్నట్లు తెలిపింది.
వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లోని 837 అసిస్టెంట్ ఇంజినీర్లు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్లు, టెక్నికల్ ఆఫీసర్లు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 5న పరీక్ష జరగ్గా.. 55వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షలకు రెండు రోజుల ముందే ప్రశ్నాపత్రం లీకైనట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో పశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని నిశితంగా గమనించిన తర్వాత పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది.