TS Group-4 | గ్రూప్-4 దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం తెలిపింది. వాస్తవానికి ఇవాళ్టితో దరఖాస్తు గడువు ముగియనుండగా.. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు 8,47,277 దరఖాస్తులు చేసుకున్నారని, ఇవాళ ఒకే రోజు 34,247 దరఖాస్తులు వచ్చాయని టీఎస్ పీఎస్సీ వివరించింది. గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గత డిసెంబర్ 30 నుంచి జనవరి 30వ తేదీ వరకు దరఖాస్తులకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. అయితే, నోటిఫికేషన్ ద్వారా 8,180 పోస్టులను భర్తీ చేయనున్నది.