TSPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్టయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్ బంధువులైన ముగ్గురిని సిట్ అరెస్టు చేసింది. తాజా అరెస్టులతో కలిసి పేపర్ లీకేజీ వ్యవహారంలో మొత్తం అరెస్టు అయిన వారి సంఖ్య 99కి పెరిగింది. అరెస్టయిన ముగ్గురు నిందితులు ప్రశ్నపత్రాల లీకేజీకి ప్రవీణ్కు సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. మరో వైపు ఈ కేసులో ఏ2 రాజశేఖర్రెడ్డి బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే రాజశేఖర్రెడ్డి బెయిల్ పిటిషన్ మూడుసార్లు తిరస్కరణకు గురైంది.