హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేత ఈటల రాజేందర్ తన రాజకీయ లబ్ధి కోసం కాంట్రాక్టు ఏఎన్ఎంలను రెచ్చగొడుతున్నారని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. ఏఎన్ఎంలకు దేశంలోనే అత్యధిక వేతనాలు తెలంగాణలో ఇస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడు తూ.. గతంలో ఆశాలు, ఏఎన్ఎంలను ప్రభుత్వాలు చిన్నచూ పు చూశాయని, చాలీచాలని జీ తాలు, అవి కూడా సకాలంలో చెల్లించలేదని విమర్శించారు. జీతాల పెంపుదల కోసం నిరసనలు, ధర్నాలు చేస్తే గుర్రాల తో తొకించారని విమర్శించారు. స్వరాష్ట్రం లో ఆశాలు, ఏఎన్ఎంలను సీఎం కేసీఆర్ గౌరవిస్తున్నారని, ఆత్మగౌరవంతో జీవిస్తూ, ప్రజలకు వైద్యసేవలు అందించేలా అవకాశం కల్పించారని వివరించారు. 2014-15లో ఏఎన్ఎంల వేతనం రూ.10 వేలు ఉంటే ఇప్పుడు రూ.27,300 పెరిగిందని వెల్లడించారు. బీజే పీ రాష్ట్రాల్లో ఆశాలు, ఏఎన్ఎంల పరిస్థితి దారుణంగా ఉ న్నదని విమర్శించారు.
ఏఎన్ఎంలకు ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో రూ.17 వేలు, ఏపీలో రూ.23,393, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రూ.18,523, తమిళనాడులో రూ.18 వేల చొప్పున ఇస్తున్నారని చెప్పారు. ఈటల రాజేందర్కు నిజం గా ప్రేమ ఉంటే, ముందు బీజేపీ రాష్ట్రాల్లో జీ తాలు పెంచేలా చూడాలని హితవు చెప్పారు. రాష్ట్రంలో ఏఎన్ఎంలకు ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పించిందని వివరించారు. ప్రజల ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసేందుకు వీలుగా ఏఎన్ఎంలకు ట్యాబ్లు పంపిణీ చేసినట్టు చెప్పారు. మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తున్న 1,520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఏఎన్ఎంలకు గరిష్ఠంగా 20 మారులు వెయిటేజీని కల్పించినట్టు వెల్లడించారు. ఏఎన్ఎంల వినతులను పరిగణనలోకి తీసుకున్న ప్రభు త్వం పరీక్షను ఇంగ్లిష్తోపాటు, తెలుగులోనూ నిర్వహించాలని నిర్ణయించిందని చెప్పారు. గతంలో వైద్యారోగ్యశాఖ మంత్రిగా పనిచేసి, వాస్తవాలు తెలిసిన ఈటల అవాస్తవాలు మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు.