హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ (టీఎస్ఐఐసీ) చైర్మన్గా గ్యాదరి బాలమల్లు పదవీకాలాన్ని మరో మూడేండ్లపాటు పొడిగించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాలతో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయశ్ రంజన్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఆరేండ్లుగా టీఎస్ఐఐసీ చైర్మన్గా బాలమల్లు కొనసాగుతున్నారు. సిద్దిపేట వ్యాస్తవ్యుడైన బాలమల్లు సీఎం కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ప్రారంభం నుంచి ఆయన వెన్నంటి ఉన్నారు. ఈ సందర్భంగా బాలమల్లు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ప్రగతి భవన్కు వచ్చిన బాలమల్లు.. తనకు మరోసారి అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.