హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అమలవుతున్న ‘గృహజ్యోతి’ (200 యూనిట్ల ఉచిత విద్యుత్తు) పథకానికి ఆమోదం తెలుపుతూ తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (టీఎస్ఈఆర్సీ) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అర్హత కలిగిన ప్రతి కుటుంబం ‘గృహజ్యోతి’ కింద మార్చి నెల నుంచి ‘జీరో బిల్లు’ను తీసుకుంటుందని, ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించిన సబ్సిడీ వివరాలు, టారిఫ్ ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్, సీఈఎస్ఎస్కు స్పష్టం చేసింది.