TS Weather Update | రాగల రెండు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తాయని చెప్పింది.
గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటూ ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. శుక్రవారం నుంచి పొడివాతావరణం ఏర్పడే సూచనలున్నాయని వివరించింది. ఇవాళ్టి ఉదయం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మరో వైపు మిగతా ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి.