TS Weather | మిగ్జాం తుఫాను ప్రభావంతో రాగల రెండురోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలెర్ట్ను జారీ చేసింది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.
ఈ క్రమంలో ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, జనగాం, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మెదక్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. అలాగే, పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని చెప్పింది.
బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం నుంచి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా అశ్వరావుపేటలో 96.8 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైందని వాతావరణశాఖ వివరించింది.