TS Weather | తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఎండలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం పెరిగే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ రాత్రి సమయాల్లో సాధారణం కంటే వేడిగా ఉండే అవకాశాలున్నాయని పేర్కొంది.
సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉన్నది చెప్పింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రాత్రిళ్లు సాధారణం కంటే వేడిగా ఉండే ఛాన్స్ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. 14 జిల్లాల్లో ఎండలు 40-44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ విభాగం తెలిపింది. 19 జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయినట్లు వివరించింది. నల్గొండ జిల్లా శివన్నగూడెంలో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యినట్లు టీఎస్డీపీఎస్ తెలిపింది. లక్కవరం రోడ్ (సూర్యాపేట)లో 43, భద్రాచలం (కొత్తగూడెం)43, సుజాత నగర్ (కొత్తగూడెం) 42.9, తడకమల్ల (నల్గొండ) 42.9, మునగాల (సూర్యాపేట) 42.9, కల్దుర్కి (నిజామాబాద్) 42.8, ఆదిలాబాద్ జిల్లా కేంద్రం 42.8, నేరేడెగొమ్ము 42.8, తిమ్మాపూర్ (నల్గొండ) 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు టీఎస్డీపీఎస్ వివరించింది.