TS Weather | రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం కురిసే సూచనలున్నాయని చెప్పింది. ఆదివారం నుంచి సోమవారం పలు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది.
ఉత్తర తెలంగాణలోని (North Telangana) 8 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీచేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగుతోపాటు వరంగల్, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. 115.6 నుంచి 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. మరో ఏడు జిల్లాల్లో 64.5 నుంచి 115.5 మిల్లీమీటర్ల మధ్య వర్షాలు కురుస్తాయని తెలిపింది