TS EAMCET | హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : టీఎస్ ఎంసెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 10 నుంచి 14 వరకు జరిగే పరీక్షల నిర్వహణకు జేఎన్టీయూ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్లో పరీక్షలు జరుగుతాయి. తొలిరోజు పేపర్ కోడ్ను ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి హైదరాబాద్ కూకట్పల్లిలోని జేఎన్టీయూలో విడుదల చేస్తారు. ఒక్కోసెషన్కు ఫార్మసీ కోర్సుల్లో 28 వేల మంది విద్యార్థులు హాజరుకానుండగా, ఇంజినీరింగ్లో 34వేల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
ఎంసెట్ విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. పరీక్షలను పూర్తి ఆత్మవిశ్వాసంతో రాయాలని సూచించారు. ఇంటర్లో వచ్చిన ఫలితాల గురించి ఆలోచించకుండా ఎంసెట్పైనే శ్రద్ధ పెట్టాలని చెప్పారు. ఎంసెట్లో ఇంటర్ వెయిటేజీ లేదు కనుక తక్కువ మార్కులొచ్చాయని బాధపడితే పరీక్షలపై ప్రతికూల ప్రభావం పడుతుందని మంత్రి తెలిపారు.