బొడ్రాయిబజార్, జనవరి 21 : పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, లేదంటే ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేటలో ఆదివారం నిర్వహించిన టీఎస్ ఎమ్మార్పీఎస్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 29న హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద పోరుగర్జన సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మాదిగలు, పారిశుద్ధ్య కార్మికులు, డప్పు చెప్పు కార్మికులు వేలాదిగా తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.