హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలు అంశంపై ఢిల్లీ వెళ్లి వచ్చిన మంత్రులు శుక్రవారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో సమావేశమయ్యారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటన విశేషాలను సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్ ముఖ్యమంత్రికి వివరించారు. కేంద్రమంత్రి పీయూష్గోయల్తో చర్చించిన అంశాలు, ఆయన చేసిన వ్యాఖ్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వపరంగా అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. సమావేశంలో రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా పాల్గొన్నారు.