హైదరాబాద్ : నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. రాష్ట్రంలో మరో 3,334 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి జారీ చేసింది. ఆబ్కారీ, అటవీ, అగ్నిమాపకశాఖల్లో ఖాళీల భర్తీకి బుధవారం జీవోలు జారీ చేసింది. ఇప్పటికే తొలి విడుతలో 30,453 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా 3,334 ఉద్యోగ నియామకాలకు పచ్చజెండా ఊపింది.
సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా 80,039 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం విధితమే. ఇందులో భాగంగా రెండో విడుతలో ఆయా శాఖల్లో నియామకాలకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. మిగతా శాఖల్లో ఉన్న పోస్టుల భర్తీకి సైతం ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.
Forest
Fire Service
Prohibition