హైదరాబాద్ : రాష్ట్రంలోని పలువురు అధికారులు, ఉద్యోగులకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవార్డులను ప్రకటించింది. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రదానం చేయనున్నది. నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. హుజూరాబాద్ ఆర్డీవో రవీందర్రెడ్డికి, మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్, మహమూబాబాద్ ఆర్డీవో కొమురయ్య, ఆదిలాబాద్ డీఎంఎల్టీ లక్ష్మణ్, నల్లగొండ నాయబ్ తహసీల్దార్ విజయ్కి ప్రత్యేక కేటగిరి అవార్డులను ప్రకటించింది. బోధన్, మహమూబాబాద్ బీఎల్వోలు అనిత, శ్రీవాస్తవకు అవార్డులకు ఎంపిక చేసింది.