హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ ): టీఎస్ ఎడ్సెట్ ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఈ ఏడాది 26,994 (98.18%) మంది విద్యార్థులు అర్హత సాధించగా, ఇందులో 21,935 (81.25%) మంది అమ్మాయిలు కాగా, 5,059 (19%) మంది అబ్బాయిలు ఉన్నారు. బీఈడీ ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్సెట్ ఫలితాలను సోమవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, ఎంజీ వర్సిటీ వీసీ గోపాల్రెడ్డి, ఎడ్సెట్ కన్వీనర్ ఏ రామకృష్ణ, కో కన్వీనర్ పీ శంకర్ విడుదల చేశారు.
ఎడ్సెట్లో వికారాబాద్ జి ల్లాకు చెందిన గొల్ల వినీషా 117.453624 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా, హైదరాబాద్కు చెందిన నిషా కుమారి 117.011152 మార్కులతో రెండో ర్యాంకును కైవసం చేసుకొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 18,350 బీఈడీ సీట్లున్నాయని లింబాద్రి తెలిపారు. అర్హులైన వారిలోచాలామందికి సీటు లభించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు అర్హత మారులు 25 శాతం, ఇతరులకు 38 శాతంగా నిర్ణయించినట్టు లింబాద్రి తెలిపారు. త్వరలోనే ఎడ్సెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు.