హైదరాబాద్ : రాష్ట్రంలో బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ ఎడ్సెట్-2022 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఫలితాలను సాయంత్రం 4:30 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి విడుదల చేయనున్నారని కన్వీనర్ ఆచార్య ఏ రామకృష్ణ తెలిపారు.
టీఎస్ ఎడ్సెట్ పరీక్ష జూలై 26న జరిగింది. ఈ పరీక్షకు 38,091 మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోగా, 31,578 మంది హాజరయ్యారు. అభ్యర్థులు ఫలితాల కోసం edcet.tsche.ac.in అనే వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.