TS Ed CET-2022 | బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్ దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఎడ్సెట్ కన్వీనర్ తెలిపారు. ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఎడ్ సెట్ నోటిఫికేషన్ గత నెల 10న విడుదలవగా.. ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. గడువు ముగిసిన నేపథ్యంలో మరోసారి అవకాశం ఇచ్చింది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఎస్సీ, ఎస్టీలు రూ.450, ఇతరులు రూ.650 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. డిగ్రీ, ఇంజినీరింగ్ చివరి సంవత్సరం
చదువుతున్న విద్యార్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయొచ్చని కన్వీనర్ రామకృష్ణ వివరించారు.