హైదరాబాద్ : ధరణి పోర్టల్లో అందిన ఫిర్యాదులను వీలైనంత తొందరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ధరణి పోర్టల్పై సంబంధిత అధికారులతో సీఎస్ శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ల సమన్వయంతో ప్రతీరోజు దరఖాస్తుల పెండింగ్ల స్థితిని అధికారులు పర్యవేక్షించాలన్నారు. వాట్సాప్, ఈ మెయిల్ మొదలగు మార్గాల్లో అందిన అన్ని ఫిర్యాదులపై ప్రామాణిక స్పందన ఇవ్వాలని ఆయన ఆదేశించారు.
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. ధరణి పోర్టల్, భూ విషయాలకు సంబంధించిన మాడ్యూల్స్, ఇతర సమస్యలను సీఎస్ భేటీలో సమీక్షించారు. ఈ సమావేశంలో వి. శేషాద్రి ఐఏఎస్, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్రావు, జీటీ వెంకటేశ్వర్ రావు ఐఆర్ఎస్, టీఎస్టీఎస్ ఎండీ సత్య శారద, సీసీఎల్ఏ ప్రత్యేక అధికారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.