వాజేడు, జూలై 30 : గోదావరిలో వరదలకు కొట్టుకొచ్చిన ఓ మొసలిని పట్టుకొని కోసి దాని మాంసాన్ని విక్రయించేందుకు యత్నించిన వ్యక్తిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఎఫ్ఆర్వో చంద్రమౌళి తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. ములుగు జిల్లా వాజేడు మండలం కృష్ణాపురం అటవీశాఖ సెక్షన్ పరిధిలోని చండ్రుపట్ల బిట్లో ఆదివారం మొసలిని కోస్తున్నట్టు సమాచారం అందింది.
బీట్ ఆఫీసర్ ప్రసాదరావు ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడికి వెళ్లి అనుమానాస్పదంగా ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మొసలి కళేబరంతోపాటు మాంసం ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణులను చంపడం చట్టరీత్యా నేరమని ఎఫ్ఆర్వో తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపై బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.