యాదాద్రి భువనగిరి : హైదరాబాద్ – విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. చౌటుప్పల్ మండలం తుప్రాన్పేట్ వద్ద జాతీయ రహదారి 65పై ఓ భారీ ట్రక్కు బోల్తా పడింది. దీంతో ఆ రహదారిపై 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకున్నారు. భారీ ట్రక్కును రోడ్డు పక్కకు నెట్టేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. ఇక వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఒకే దారిలో వాహనాల రాకపోకలకు అనుమతించారు. ట్రాఫిక్జామ్ నేపథ్యంలోఓ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.