హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ కాలంలో వందలాది మంది విద్యార్థులు అమరులు అవ్వడానికి కారణమైన ఆంధ్రా కుట్రదారుల సంతానం ఇవాళ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించడం అత్యంత హేయమైన చర్యగా టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు పేర్కొన్నారు. ఉద్యమ కుటుంబంపై మకిలి జల్లడం అత్యంత హేయమైన చర్యగా భావించి అమరవీరుల స్థూపాన్ని పసుపునీళ్లతో శుద్ధి చేసి పాలాభిషేకం చేశారు.
కేసీఆర్ కుటుంబంపై నోరు పారేసుకుంటే భవిష్యత్ లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అమరుల కుటుంబాలను ఆదుకున్నది, వారికి తగిన గుర్తింపునిచ్చింది కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణ అమరులు, ఉద్యమకారుల పట్ల అత్యంత నిబద్ధత కలిగిన నాయకుడు కేసీఆర్ మాత్రమేనని తేల్చిచెప్పారు. ఇవన్నీ గుర్తించకుండా అవాకులు చవాకులు పేలితే గతంలో మానుకోట జరిగిన ఘటన పునరావృతం అవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శేషు, కృష్ణ, బొల్లు నాగరాజు, జంగయ్య మదన్,తరుణ్ సందీప్,కుమార్
తదితరులు పాల్గొన్నారు.