హైదరాబాద్ : సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ దసరా కానుక ప్రకటించిన నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికుల తరపున సీఎం కేసీఆర్కు కవిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా, అత్యంత ఎక్కువ మొత్తంలో దసరా బోనస్ అందిస్తున్న తెలంగాణ రాష్ట్రం, ఈ ఏడాది అర్హులైన సింగరేణి కార్మికులకు రూ. 368 కోట్లు అందించడం గొప్ప విషయమన్నారు. కార్మికుల శ్రమ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణి సంస్థ మరింత ముందుకు సాగుతూ, దేశానికి వెలుగులు పంచాలని ఆకాంక్షిస్తున్నానని కవిత పేర్కొన్నారు. దసరా పండుగ లోపు ఈ వాటాను ఉద్యోగులకు చెల్లించాలని సీఎం ఆదేశించారు.