ఎల్బీనగర్, సెప్టెంబర్ 4: యువకుడి కిడ్నాప్ కేసులో అరెస్టయిన గడ్డిఅన్నారం బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్మహేశ్వర్రెడ్డి దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. కార్పొరేటర్గా సామాజిక సేవలు కాకుండా గూండాగిరీతో అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ, ప్రజలను కిడ్నాప్ చేయడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
వివేకానందనగర్ చౌరస్తా నుంచి ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ వరకు అతడి దిష్టిబొమ్మ ర్యాలీగా తీసుకొచ్చి దహనం చేశారు. కార్యక్రమంలో గడ్డిఅన్నారం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కల శ్రీశైలం యాదవ్, మాజీ కార్పొరేటర్ ప్రవీణ్, మాజీ కౌన్సిలర్ రమేశ్ ముదిరాజ్, నాయకులు పాల్గొన్నారు.