హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అభివృద్ధికి రాజీలేని పోరాటం చేసేది ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ఒక్కటేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. తెలంగాణకు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్సే శ్రీరామరక్ష అని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణ.. దేశంలోని 28 రాష్ర్టాల్లో ఒక రాష్ట్రమని, ఆ పార్టీలకు తెలంగాణ ప్రయారిటీ కాదని అన్నారు. కానీ టీఆర్ఎస్ ధ్యాస అంతా తెలంగాణేనని, తమకు మొదటి, ఆఖరి ప్రయారిటీ తెలంగాణ మాత్రమేనని స్పష్టంచేశారు. సందర్భం ఏదైనా, ఎన్నికలు ఏవైనా ప్రజలు టీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారని అన్నారు. తెలంగాణ భవన్లో సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుంచి పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్లో చేరిన వారిని మం త్రి కేటీఆర్ అభినందించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ..
కేసీఆర్.. టీఆర్ఎస్సే శ్రీరామరక్ష
సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించుకోవటమే కాదు రాష్ర్టాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం సేవ చేస్తున్నది. కరోనా వల్ల కొంత దెబ్బతిన్నా భవిష్యత్లో ఇదే స్ఫూర్తితో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల మాదిరిగా ముం దుకు తీసుకెళతాం. పనిచేసే ప్రభుత్వాన్ని, పనిచేసే నాయకుడిని ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారు. ఎవరెన్ని మాట్లాడినా.. ఎవరెన్ని చిల్లర మల్లర రాజకీయాలు చేసినా, ఎంత కుసంస్కారంతో వ్యవహరించినా ప్రజలు అవేవీ పట్టించుకోరు. తమకు ఏ నాయకుడు.. ఏ ప్రభుత్వం మేలు చేస్తదో.. వారికి అండగా ఉంటారు. 2014 నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తూనే ఉన్నారు. 2018లో మళ్లీ తిరుగులేని మెజారిటీతో సీఎం కేసీఆర్ను అఖండ మెజారిటీతో గెలిపించారు. ఓ రెండు పదవులు రాగానే కొంతమంది కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఎగిరెగిరి పడుతున్న రు. కానీ వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆవన్నీ హనుమంతుని ముందు కుప్పిగంతులు వేసినట్టే అవుతుంది. అన్ని రాష్ర్టాలకు సీఎంలుంటారు. కానీ మన రాష్ర్టానికి రాష్ర్టాన్నే తెచ్చిన సీఎం ఉన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వమే మనకు శ్రీరామరక్ష. కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం, రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం ఉంటదని, రాష్ట్ర పురోగతి ఉంటదని ప్రజలో బలంగా విశ్వాసం ఉన్నది.
తెలంగాణ అభివృద్ధికి రాజీలేని పోరాటం
కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణ దేశంలోని 28 రాష్ర్టాల్లో ఒక రాష్ట్రం. ఆ పార్టీలకు ఇది ప్ర యారిటీ కాదు. కానీ టీఆర్ఎస్కు మొదటి, ఆఖరి ప్రయారిటీ తెలంగాణ మాత్రమే. అందు కే కృష్ణాజలాలుకానీ, మరో విషయంలో కానీ రాజీలేకుండా పోరాటం చేసేది. అదే ఇక్కడి కాంగ్రెస్.. ఇక్కడి బీజే పీ నాయకులు ఒకలా గా.. ఏపీలో ఉన్న వారి పార్టీల నా యకులు మ రోలా మాట్లాడతారు. స్వరం మారుతది. అక్కడ నోటికి వచ్చినట్టు ఉల్టాఫుల్టా మాట్లాడతారు. కానీ టీఆర్ఎస్ మాత్రం డబుల్ స్టాం డర్డ్స్ లేకుండా.. తెలంగాణ ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసే పార్టీ. స్వీయ రాజకీయ అస్తిత్వం ఉండాలని జయశంకర్ సార్ చెప్పి న్రు. తెలంగాణ ప్రాంత ప్రజలకంటూ ఒక చిరునామా.. ఒక గుర్తింపు.. గౌరవం.. కో సం రాజీలేనిపోరాటం చేయగలిగేది టీఆర్ఎస్సే.
ఎల్ రమణకు పార్టీ సభ్యత్వం..
రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, మం త్రిగా, ఎంపీగా సుదీర్ఘకాలం పనిచేసిన ఎల్ రమణ ఈ రోజే మంచి ముహూర్తం కాబట్టి లాంఛనంగా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. రాష్ట్రంలో ఎంతో సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండి వివిధ సందర్భాల్లో మనతో విభేదించిన వాళ్లు కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని భావిస్తున్నారు. రాష్ట్ర పురోగతికి టీఆర్ఎస్ మాత్రమే రాజీలేని పోరాటం చేస్తుం ది అనే స్పష్టత అందరికీ వస్తున్నది.
టీఆర్ఎస్లో చేరిన స్థానిక నేతలు
జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుం చి కార్పొరేటర్లు బల్లి శ్రీనివాస్, కుతాడి సాయి, జమాల్పూర్ నవీన్, చింతల ప్రేమలశ్రీనివాస్, ఘట్కేసర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ అనురాధా రాఘవరెడ్డి, తూముకుంట మున్సిపాలిటీ కౌన్సిలర్లు రాజ్పూత్ పూజాభరత్సింగ్, సింగిరెడ్డి మధుసూదన్రెడ్డి, బొమ్మర్సాయిపేట ఎంపీటీసీ సింగిరెడ్డి ఇందిర, పొన్నల్ ఎంపీటీసీ ఎం మౌనికా శివవీర ప్రసాద్, ఆలియాబాద్ ఎంపీటీసీ కూడురు అశోక్ తదితరులు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి ఆయన కం డువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కార్మిక మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు పాల్గొన్నారు.
రూ.250 కోట్లతో లిసెంట్ ప్లాంట్
రాష్ట్రంలో ఎక్కడాలేనివిధంగా మేడ్చల్ నియోజకర్గంలో పది మున్సిపాలిటీలున్నాయి. ఆ పదింటిని టీఆర్ఎస్ గెలుచుకున్నది. రాష్ట్రం మొత్తంలోనే అత్యధికంగా సమస్యలు, పేదరి కం, వెనుకబాటుతనం ఉన్న కార్పొరేషన్లలో జవహర్నగర్ ఒకటి. హైదరాబాద్ నగరానికి సంబంధించిన మొత్తం డంప్ యార్డ్ ఇక్కడే ఉన్నది. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే 20 మెగావాట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను ఇక్కడే పె ట్టాం. ఇది దక్షిణభారతదేశంలో అతిపెద్దది. హైదరాబాద్ ప్రజలు ఎంతచేసినా జవహర్నగర్ రుణాన్ని తీర్చుకోలేం. గుట్టలు గుట్టలుగా ఉన్న లెగసీ డంప్ యార్డ్ను క్యాపింగ్ చేయడం వల్ల చాలావరకు సమస్య తగ్గింది. దశాబ్దాలుగా చెత్త పేరుకుపోవడం వల్ల వర్షం పడ్డ ప్రతిసారి డంప్యార్డు కింది నుంచీ నీళ్లు వెళ్లి సమీపంలోని చెరువుల్లో కలుస్తున్నాయి. దీంతో అంతా దుర్గంధభరితం అవుతున్నది. దీన్ని అరికట్టేందుకు రూ. 250 కోటతో లిసెంట్ ట్రీట్మెంట్ ప్లాంటన్ను ఇప్పటికే మంజూరుచేశాం. టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసి జవహర్నగర్ ప్రజలకు న్యాయం చేస్తాం. ఈ కార్పొరేషన్ను ప్రత్యేక నిధులు కావాలని మంత్రి కోరారు. జీవో నెంబర్ 58, 59 కింద పేదలకు పట్టాలు ఇచ్చినట్టే ఇక్కడ కూడా ఇవ్వాలనే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషిచేస్తాం’ అని చెప్పారు.
జవహర్నగర్లో రేవంత్కు భారీషాక్!
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/మేడ్చల్, జూలై 12 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి నియామకంతో ఏదో ఊడిపడుతుందనుకున్న హస్తం అధిష్ఠానానికి షాక్ మీద షాక్ తగులుతున్నది. ఆయన మల్కాజిగిరి నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అవుతున్నది. తాజాగా జవహర్నగర్, తూంకుంట మున్సిపాలిటీల పరిధిలోని పార్టీ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరడంతో మిగిలిన కొద్దోగొప్పో క్యాడర్ కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నది. ఘట్కేసర్ మున్సిపాలిటీకి చెందిన పలువురు టీఆర్ఎస్లో చేరారు. జవహర్నగర్ కార్పొరేషన్లో 28 స్థానాలకు నాలుగు స్థానాలే కాంగ్రెస్కు దక్కాయి. ప్రస్తుతం ఈ నలుగురు కార్పొరేటర్లు కూడా టీఆర్ఎస్లో చేరడంతో ఆ కార్పొరేషన్ కాంగ్రెస్ ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. తూంకుంట మున్సిపాలిటీలోనూ రెండు వార్డులు కాంగ్రెస్కు దక్కగా.. రేపోమాపో ఆ ఇద్దరు కౌ న్సిలర్లు రాజ్పుత్ పూజ భరత్సింగ్, సింగిరెడ్డి మాధుసూదన్రెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని మేడ్చల్ జిల్లాలో కీలకనేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఇదివరకే పార్టీని విడిచిపెట్టారు. త్వరలో మరింత మంది కీలక కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం.