హైదరాబాద్ : తడీపార్ అమిత్షాకు తంబాకు బండి సంజయ్ ఎన్ని చెప్పులు మోసినా మునుగోడులో ముమ్మాటికీ గెలిచేది టీఆర్ఎస్ పార్టీయేనని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. సోమవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, నోముల భగత్, ఎన్ భాస్కర్రావుతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఆత్మగౌరవాన్ని కాంట్రాక్టులు, కమీషన్ల కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి ప్రజలు బుద్ధిచెబుతారని స్పష్టం చేశారు.
మునుగోడులో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఏనాడూ పట్టించుకోలేదని మండిపడ్డారు. బండి సంజయ్ బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని అమిత్షా చెప్పుల దగ్గర తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో జనలేకవెళవెళబోయిందన్నారు. సీఎం కేసీఆర్ అడిగిన ఒక్క ప్రశ్నకు అమిత్షా సమాధానం చెప్పకుండా తోకముడిచారన్నారు. దేశరైతుబంధుగా సీఎం కేసీఆర్ను కీర్తిస్తుంటే అమిత్షా సిగ్గులేకుండా రైతువిరోధిగా పేర్కొనటం అవగాహన రాహిత్యానికి నిదర్శనమంటూ ఎంపీ ధ్వజమెత్తారు.