తెలంగాణ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు పర్వతాలు
హుజూరాబాద్లో ప్రజా చైతన్యయాత్ర
హుజూరాబాద్ టౌన్, జూలై 21: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలువడం ఖాయమని తెలంగాణ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు జింకల పర్వతాలుయాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యార్థి జేఏసీ ప్రజా చైతన్య యాత్ర లో భాగంగా బుధవారం హుజూరాబాద్లోని కొత్తపల్లి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాగా జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలంలో జేఏసీ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.