హైదరాబాద్ : మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలిచిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రెండు, మూడు స్థానాలకు కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉందని ఆయన అన్నారు. ప్రగతి భవన్లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి తన పదవిని ఫణంగా పెట్టి, బీజేపీకి అమ్ముడు పోయిండని ధ్వజమెత్తారు. రూ. 22 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాతనే ఆయన బీజేపీలో చేరిండని తెలిపారు. ఉప ఎన్నిక కోసం రాజగోపాల్ రూ. 500 కోట్లు ఖర్చు పెడుతానని అమిత్ షా ఓ పెద్దమనిషికి చెప్పిండట. ఆ పెద్ద మనిషి తనను కలిసి ఆ విషయాన్ని చెప్పాడని కేటీఆర్ పేర్కొన్నారు.
ఓటుకు రూ. 30 వేలు ఇచ్చి అయినా గెలుస్తానని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నాడు. కాంట్రాక్టర్ బలుపుకు, మునుగోడు ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నిక ఇది అని స్పష్టం చేశారు. మునుగోడులో తమకు 30 శాతం ఓట్లు ఎక్కువగా ఉన్నాయని కేటీఆర్ తెలిపారు.