హైదరాబాద్, జూలై 27(నమస్తే తెలంగాణ): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని హోంమంత్రి మహమూద్ అలీ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా మసీదుల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ ముజాహిద్ హుస్సేన్ తదితరులు మంగళవారం హైదరాబాద్లో హోంమంత్రిని కలిసి మసీదుల నిర్మాణానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి.. శ్మశానవాటికల కోసం మూడెకరాల ప్రభుత్వ భూమి, వివాహ వేదికల నిర్మాణానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు సూచించారు. మిగతా సమస్యలను త్వరగా పరిషరిస్తామని వారికి హామీ ఇచ్చారు.