న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ (TRS) పార్టీ పార్లమెంటు ఉభయసభల్లో ఆందోళన కొనసాగిస్తున్నది. తెలంగాణ నుంచి మొత్తం పంటను కొనుగోలు చేయాలని, ఏడాది లక్ష్యాన్ని ముందే చెప్పాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, జాతీయ సమగ్ర ధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. మంగళవారం ఎంపీలు ఉభయ సభల్లో వెల్లోకి వెళ్లి నిరసన తెలిపారు. ఇతర విపక్ష సభ్యులతో పాటు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.
లోక్సభలో విపక్ష సభ్యులు వాకౌట్ చేసిన తర్వాత కూడా టీఆర్ఎస్ ఎంపీలు తమ ఆందోళ కొనసాగించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. ఇదే అంశంపై బుధవారం కూడా లోకసభలో టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. రాజ్యసభలో ఇతర పక్షాలతో కలిసి తమ నిరసన కొనసాగించాలని నిర్ణయించింది.