హైదరాబాద్, ఆగస్టు 21 (నమ స్తే తెలంగాణ): కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ ఎవరిని వంచించేందుకని రాష్ట్ర రెడ్కో చైర్మన్, టీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వై సతీశ్రెడ్డి బీజేపీని ప్రశ్నించారు. ఆర్ఆర్ఆర్ సినిమాను బహిష్కరిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసి న ప్రకటన వార్తను జతచేస్తూ.. ‘ఆర్ఆర్ఆర్ సినిమాను బహిష్కరిస్తున్నామని బీజేపీ చెప్పింది.
ఆ సినిమా రీల్స్ను కాల్చివేయాలని పిలుపునిచ్చింది. ఇప్పుడు అనూహ్యంగా ఆ పార్టీ ముఖ్య నేత అమిత్షాకు ఆర్ఆర్అర్ సినిమా తెగ నచ్చేసిందట. సినిమా నటుడు జూనియర్ ఎన్టీఆర్ను ప్రత్యేకంగా కలిసి మెచ్చుకోవడం ఎందుకో? ఈ భేటీ ఎవరిని వంచించేందుకు!?’ అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.