హైదరాబాద్ : వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ పోరాటానికి సిద్ధమైంది. గ్యాస్ సిలిండర్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ఇవాళ నిరసన ప్రదర్శనలు చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అన్ని మండల, పట్టణ కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని కేటీఆర్ సూచించారు.
గృహావసరాల కోసం వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్పై రూ. 50 మేర పెంచింది. దీంతో హైదరాబాద్లో సిలిండర్ ధర రూ. 1,055 నుంచి రూ. 1,105కు ఎగబాకింది. బుధవారం నుంచే తాజా ధరలు అమల్లోకి వచ్చినట్టు ఆయిల్ కంపెనీలు తెలిపాయి. సాధారణంగా ప్రతి నెల 1న గ్యాస్ ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. అయితే, 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను సవరించిన కంపెనీలు, 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలో మార్పు చేయలేదు.