నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని ఎల్లమ్మగుట్టలో నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయం వద్ద పార్టీ జెండాను సీఎం ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం పార్టీ ఆఫీసులో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డిని సీట్లో కూర్చోబెట్టారు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మరికాసేపట్లో నిజమాబాద్ జిల్లా కలెక్టరేట్ను సీఎం ప్రారంభించనున్నారు.