హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు మద్దతుగా మహిళలు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. గెల్లు శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని మహిళలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కమలాపూర్ మండలంలోని మర్రిపెళ్లి గూడెంలో సర్పంచ్ కిరణ్మయి ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు.
కమలాపూర్ మండలంలోని పంగిడిపల్లిలో ప్రచారం నిర్వహించిన ఎంపీటీసీ సుగుణాకర్.. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు.
కమలాపూర్ మండలం కర్నూల్ గ్రామంలో సింగిల్ విండో చైర్మన్ సంపత్ రావు ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
హుజూరాబాద్లోని రెండు, మూడు, ఐదో వార్డులో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ప్రచారం నిర్వహించి.. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను వివరించారు.
కమలాపూర్ మండల కేంద్రంలో సర్పంచ్ విజయ మహిళలకు బొట్టు పెట్టి కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.