హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో ఈ సమావేశం ప్రారంభం అయింది. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలపై సీఎం కేసీఆర్ ఎంపీలతో చర్చిస్తున్నారు. అలాగే కేంద్రంపై అనుసరించాల్సిన పోరాట పంథాపై ఎంపీలకు సీఎం సూచనలు చేస్తున్నారు. దాదాపు 5 గంటల నుంచి ఈ సమావేశం కొనసాగుతోంది.